సోఫియాలో కొనసాగుతున్న ఎన్కౌంటర్
ABN , First Publish Date - 2020-06-07T16:35:55+05:30 IST
జమ్మూ కశ్మీర్లోని సోఫియాన్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు ఎన్కౌంటర్ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. సోఫియాలోని
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని సోఫియాన్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు ఎన్కౌంటర్ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. సోఫియాలోని రెబన్ జిల్లాలో ఉగ్రవాదులు మాటువేసి ఉన్నారని పక్కా సమాచారాన్ని అందుకున్న భద్రతా బలగాలు వారికోసం ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఆ ఆపరేషన్ కాస్తా ఎన్కౌంటర్ దిశగా మళ్లిందని పేర్కొన్నారు. ఉగ్రవాదులు తమపై హఠాత్తుగా కాల్పులకు తెగబడ్డారని, దీంతో తామూ కాల్పులు జరిపామని, ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే ముగ్గురు తీవ్రవాదులను భద్రతా బలగాలకు చిక్కినట్లు సమాచారం.