ముగిసిన శాప్ జోనల్ స్థాయి టెన్నిస్ పోటీలు
ABN , First Publish Date - 2022-01-20T06:19:55+05:30 IST
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ రెండు రోజులపాటు నిర్వహించిన జోనల్ స్థాయి టెన్నిస్ టోర్నీ బుధవారం ముగిసింది. జీవీఎంసీ టెన్నిస్ కాంప్లెక్సులో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఒలింపియన్ ఎంవీ మాణిక్యాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఎన్.సూర్యారావు, ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీ, ధ్రువపత్రాలు అందజేశారు. టోర్నీ టెక్నికల్ ఇన్చార్జి, టెన్నిస్ ఎన్ఐఎస్ కోచ్ బాబ్జి, సత్యగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం (స్పోర్ట్సు), జనవరి 19: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ రెండు రోజులపాటు నిర్వహించిన జోనల్ స్థాయి టెన్నిస్ టోర్నీ బుధవారం ముగిసింది. జీవీఎంసీ టెన్నిస్ కాంప్లెక్సులో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఒలింపియన్ ఎంవీ మాణిక్యాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఎన్.సూర్యారావు, ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీ, ధ్రువపత్రాలు అందజేశారు. టోర్నీ టెక్నికల్ ఇన్చార్జి, టెన్నిస్ ఎన్ఐఎస్ కోచ్ బాబ్జి, సత్యగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలివి
బాలికల అండర్-12 విభాగంలో పరిణిత, కె.హారిక, పి.సెవిత, బి.మోనిష... అండర్-12 కేటగిరీలో కె.సాయి మిఽథుల, హన్షిణి.... అండర్-14 విభాగంలో టి.మోక్ష, ఎ.అరుషి, ఆర్.హాసిని, ఎ.తేజల్ తన్మయ్...వై.భావన, హసీనా షేక్, ఎం.రోమ, ఇషావీన్....అండర్-18 విభాగంలో ఎం.సంజన, ఎస్.స్నేహ తొలి నాలుగు స్థానాలలో నిలిచారు. బాలుర అండర్-10 విభాగంలో కె.శ్రీకృష్ణ, టి.పవన్ తేజ, పి.సత్యన్, రేవంత్ రిషి...అండర్-12 విభాగంలో సీహెచ్.లక్ష్యవర్ధన్, కె.సాయి మణికంఠ, గౌతమ్, కె.సాయి సిద్ధార్ధ్....అండర్-14 విభాగంలో ఽధ్రువనిశ్చల్, కె.శౌర్య....అండర్-16 కేటగిరీలో కె.సాయి హితేష్, బ్రాడన్ పెర్నీ, హేమంత్ నాయుడు, అఖిల్...అండర్-18 విభాగంలో మురళీకృష్ణ, ఎన్.కుశాల్ వర్మ, ఎస్.నిఖిల్, ఎస్.సుహాష్....సీనియర్ విభాగంలో మోజేష్బాబు, కేఎస్ అభిషేక్ తొలి నాలుగు స్థానాలలో నిలిచారు.