గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్యకు ఈడీ సమన్లు

ABN , First Publish Date - 2020-10-21T17:35:55+05:30 IST

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది....

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్యకు ఈడీ సమన్లు

లక్నో (ఉత్తరప్రదేశ్): యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్య రిచాకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. వికాస్ దూబేతోపాటు అతని అనుచరులు 10 మంది, ఫైనాన్షియర్ జయకాంత్ బాజ్ పాయ్ లపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. వికాస్ దూబే ఎన్ కౌంటర్ కావడంతో అతని భార్య రిచాను విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. వికాస్ దూబే తోపాటు అతని అనుచరులపై 60 కేసులు నమోదైనాయి. వికాస్ దూబే డబ్బును సరిహద్దులు దాటించారని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈడీ అధికారులు లక్నో కార్యాలయంలో వికాస్ దూబే భార్య రిచాను విచారించనున్నారు.  

Updated Date - 2020-10-21T17:35:55+05:30 IST