17 వందల కోట్ల ఫ్రాడ్ కేసులో ఉప్పలపాటి హిమబిందు అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-05T21:23:44+05:30 IST

హైదరాబాద్: 17 వందల కోట్ల ఫ్రాడ్ కేసులో విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.

17 వందల కోట్ల ఫ్రాడ్ కేసులో ఉప్పలపాటి హిమబిందు అరెస్ట్

హైదరాబాద్: 17 వందల కోట్ల ఫ్రాడ్ కేసులో విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. 2018లో విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు డైరెక్టర్లు ఉప్పలపాటి హిమ బిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, వెంకటరమణపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడి... నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుండి రుణాలు పొందిన ముగ్గురు డైరెక్టర్లలో ఉప్పలపాటి హిమబిందును అరెస్టు చేసి మరో ఇద్దరు డైరెక్టర్ల కోసం లుక్  అవుట్ నోటీసులు జారీచేసింది. విఎంసి సిస్టమ్స్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 539 కోట్లు, ఎస్బిఐ, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి 1207 కోట్లు రుణం పొందింది. కంపెనీకి బిఎస్ఎన్ఎల్ నుంచి 33 కోట్లు బకాయిలు రావాల్సి ఉంటే 262 కోట్లు రావాల్సి ఉందని డైరక్టర్లు 2018లో సీబీఐని తప్పు దోవ పట్టించారు.

Updated Date - 2021-08-05T21:23:44+05:30 IST