రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-03-14T14:11:51+05:30 IST

ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ పరీక్షలు రాసేందుకు కళాశాలకు బైక్‌పై..

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్/ఏఎస్‌రావునగర్‌ : ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ పరీక్షలు రాసేందుకు కళాశాలకు బైక్‌పై వెళ్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మల్లాపూర్‌ మల్లికార్జునగర్‌కు చెందిన నందిగామ సుధాకర్‌ కుమారుడు నందిగామ అశోక్‌(24), ఘట్కేసర్‌ మండలం ఏదులాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. ఫైనలియర్‌ పరీక్షలు రాసేందుకు శనివారం ఇంటి నుంచి ఏదులాబాద్‌లోని కళాశాలకు తన ద్విచక్రవాహనం(టీఎస్‌08సీజీ-5305)పై బయలుదేరాడు. అశోక్‌నగర్‌ కేబుల్‌ చౌరస్తా నుంచి చర్లపల్లి వెళ్లే దారిలో మూలమలుపు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ అశోక్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అశోక్‌ తలకు హెల్మెట్‌ ఉన్నప్పటికీ ఎగిరిపడడంతో తలకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే అశోక్‌ ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. టిప్పర్‌ డ్రైవర్‌ దాసరి సురే‌ష్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మదన్‌లాల్‌ తెలిపారు. 

Updated Date - 2021-03-14T14:11:51+05:30 IST