1 నుంచి Engineering మొదటి సంవత్సరం తరగతులు

ABN , First Publish Date - 2021-10-21T15:16:06+05:30 IST

ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు నవంబరు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అన్నా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు వర్శిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు నవం

1 నుంచి Engineering మొదటి సంవత్సరం తరగతులు

పెరంబూర్‌(chennai): ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు నవంబరు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అన్నా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు వర్శిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు నవంబరు 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. చివరి సంవత్సరం విద్యార్థులు హాస్టల్‌ ఖాళీ చేసిన వెంటనే మొదటి సంవత్సరం విద్యార్థులకు నేరుగా తరగతులు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 7వ తేదీ నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంజనీరింగ్‌ పాఠ్య ప్రణాళికలో మార్పులు చేపట్టనున్నారు. తొలివిడతగా ఈ ఏడాది నుంచి మొదటి సంవత్సరం విద్యార్థుల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేపట్టారు. 

Updated Date - 2021-10-21T15:16:06+05:30 IST