ఐదో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
ABN , First Publish Date - 2021-09-08T01:33:27+05:30 IST
భారత్తో ఈ నెల 10న ప్రారంభం కానున్న చివరి టెస్టు కోసం 16 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది.
లండన్: భారత్తో ఈ నెల 10న ప్రారంభం కానున్న చివరి టెస్టు కోసం 16 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్ తిరిగి జట్టులోకి వచ్చారు. బ్యాట్స్మన్ శామ్ బిల్లింగ్స్కు విశ్రాంతినిచ్చింది. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో బట్లర్ నాలుగో టెస్టు మిస్ కాగా, ఐదో టెస్టు తుది జట్టులో లీచ్కు చోటు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నెల 10న మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో చివరి టెస్టు జరగనుంది. కాగా, ఓవల్లో జరిగిన నాలుగో టెస్టులో బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ 157 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఫలితంగా కోహ్లీ సేన 2-1తో ఆధిక్యంలో ఉంది.
ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్) మెయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్స్టో, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, శామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఒవెర్టన్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్వుడ్.