వెస్టిండీస్తో తొలి టెస్టు.. 13 మందితో ఇంగ్లాండ్ జట్టు
ABN , First Publish Date - 2020-07-05T02:52:22+05:30 IST
ఒకపక్క ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్నా ఇంగ్లాండ్ మాత్రం క్రికెట్ను పునరుద్ధరించే పనిలో పడింది. అందులో భాగంగా...
లండన్: ఒకపక్క ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్నా ఇంగ్లాండ్ మాత్రం క్రికెట్ను పునరుద్ధరించే పనిలో పడింది. అందులో భాగంగా సొంతగడ్డపై వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. దీనికోసం అన్ని ఏర్పాట్లూ చకచకా పూర్తి చేస్తోంది. ఇటీవలే విండీస్ జట్టు సభ్యులు కూడా ఇంగ్లాండ్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటి టెస్టు కోసం జట్టు సభ్యుల పేర్లను ఈసీబీ(ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు) ప్రకటించింది. 13 మందితో కూడిన ఈ జట్టుకు ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ సారథ్యం వహించనున్నాడు. జట్టులో బెన్స్టోక్స్(కెప్టెన్) కాగా, జేమ్స్, ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, డోమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, జాక్ క్రాలర్, జో డెన్లీ, ఓలీ పోప్, డామ్ సిబ్లీ, క్రిస్ వోక్స్, మార్క్ ఉడ్ ఉన్నారు.
వీరితోపాటు రిజర్వ్డ్ ఆటగాళ్లుగా మరో 9మందిని ఈసీబీ ప్రకటించింది. వారిలో శామ్ కుర్రన్, బెన్ ఫోక్స్, డ్యాన్ లారెన్స్, జాక్ లీచ్, సకీబ్ మహ్మూద్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్, ఓలీ స్టోన్ పేర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే విండీస్తో జరగనున్న తొలి టెస్టు ఈ నెల 8వ తేదీన ప్రారంభం కానుంది. హాంప్షైర్లోని రోజ్ బౌల్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు.