హమ్మయ్య.. ఓటమి నుంచి బయటపడిన ఇంగ్లండ్!
ABN , First Publish Date - 2022-01-09T23:00:33+05:30 IST
వరుస పరాజయాలతో ఇప్పటికే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ను కోల్పోయిన ఇంగ్లండ్కు నాలుగో టెస్టులో చావు తప్పి
సిడ్నీ: వరుస పరాజయాలతో ఇప్పటికే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ను కోల్పోయిన ఇంగ్లండ్కు నాలుగో టెస్టులో చావు తప్పి కన్నులొట్టిపోయిన పనైంది. క్రీజును పాతిపెట్టుకుని బ్యాటింగ్ చేసిన స్టువర్ట్ బ్రాడ్ (8), అండర్సన్ (0)లు జట్టును ఓటమి నుంచి గట్టెక్కించారు. విజయానికి అవసరమైన ఒక్క వికెట్ను తీయలేక అందివచ్చిన విజయాన్ని దూరం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది.
ఆసీస్ నిర్దేశించిన 388 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. కాగా, ఐదు టెస్టుల ఈ సిరీస్లో తొలి మూడు టెస్టుల్లోనూ అద్భుత విజయం సాధించిన ఆసీస్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి టెస్టు ఈ నెల 14 నుంచి హోబర్ట్లో జరగనుంది.