ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటున్న వారికి ఓ శుభవార్త..!

ABN , First Publish Date - 2021-10-25T03:23:27+05:30 IST

ఇంగ్లాండ్‌లో పర్యటించాలనుకుంటున్న విదేశీయులకు అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారు ఇకపై ఖరీదైన ఆర్‌టీపీసీఆర్ కరోనా పరీక్షకు బదులు చవకైన లాటరల్ ఫ్లో టెస్ట్‌ చేయించుకున్నా సరే దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది.

ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటున్న వారికి ఓ శుభవార్త..!

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌లో పర్యటించాలనుకుంటున్న విదేశీయులకు అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారు ఇకపై ఖరీదైన ఆర్‌టీపీసీఆర్ కరోనా పరీక్షకు బదులు చవకైన లాటరల్ ఫ్లో టెస్ట్‌ చేయించుకున్నా సరే దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనితో అక్కడ పర్యటక రంగం మరింత దూసుకుపోయేందుకు అవకాశం ఏర్పడింది. అయితే..బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన రెడ్ లిస్ట్‌లో లేని దేశాల ప్రజలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇటీవల కాలంలో బ్రిటన్ ప్రభుత్వం కరోనా ఆంక్షలు క్రమంగా తొలగిస్తోందన్న విషయం తెలిసిందే. కాగా.. బ్రిటన్‌లో కరోనా కలకలం మళ్లీ మొదలైంది. రోజువారి కేసుల సగటు సంఖ్య 40 వేలు దాటింది. శనివారం అక్కడ కొత్తగా 44985 కేసులు వెలుగు చూశాయి.  


Updated Date - 2021-10-25T03:23:27+05:30 IST