ఇంగ్లండ్ ఎదురీత !
ABN , First Publish Date - 2021-03-06T18:53:51+05:30 IST
మొతేరాలో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ జట్టు పీకలోతు కష్టాల్లో పడింది.
అహ్మదాబాద్:మొతేరాలో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ జట్టు పీకలోతు కష్టాల్లో పడింది. 65 పరుగులకే కీలకమైన 6 వికెట్లు కోల్పోయింది. 160 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్ ప్రారంభించిన రూట్ సేన.. అశ్విన్ వేసిన ఐదో ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. నాల్గో బంతికి క్రాలే(05)ను పెవిలియన్ పంపిన అశ్విన్, ఆ తర్వాతి బంతికే బెయిర్స్టో(0)ను అవుట్ చేశాడు. దీంతో 10 పరుగులకే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సిబ్లీ(03), బెన్ స్టోక్స్(02)ను అక్షర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత పొప్తో కలిసి కెప్టెన్ రూట్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో 15 పరుగులు చేసిన పొప్.. అక్షర్ వేసిన చక్కటి బంతికి బోల్తా పడ్డాడు. దీంతో ఈ ద్వయం 35 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రూట్ కూడా మరోసారి అశ్విన్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. 30 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దాంతో ఇంగ్లండ్ 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ప్రస్తుతం క్రీజులో లారెన్స్(07), ఓల్లీ పొప్(01) ఉండగా.. ఇంగ్లండ్ స్కోర్: 74/6(28 ఓవర్లు). ఇంకా ఇంగ్లీష్ జట్టు 86 పరుగులు వెనకబడి ఉంది.