భారత్తో జాగ్రత్త
ABN , First Publish Date - 2021-01-27T06:41:49+05:30 IST
భారత పర్యటనలో కఠిన సవాల్కు ఇంగ్లండ్ జట్టు సిద్ధంగా ఉండాలని ఆ దేశ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాడని కొనియాడాడు...
న్యూఢిల్లీ: భారత పర్యటనలో కఠిన సవాల్కు ఇంగ్లండ్ జట్టు సిద్ధంగా ఉండాలని ఆ దేశ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాడని కొనియాడాడు. ‘ఆసీస్ టూర్లో 36 పరుగులకే కుప్పకూలి 0-1తో వెనకబడడంతో పాటు స్టార్ ఆటగాళ్లను కోల్పోయినా భారత్ టెస్టు సిరీ్సను గెలవగలిగింది. అందుకే ఇంగ్లండ్ జట్టు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎలాంటి తప్పులు చేయకుండా ఆడాల్సి ఉంటుంది’ అని నాసిర్ సూచించాడు.