టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
ABN , First Publish Date - 2021-03-17T00:27:34+05:30 IST
మూడో టీ20లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం మూడో టీ20 జరగనుంది. దీనికోసం టీమిండియా..
ఇంటర్నెట్ డెస్క్: మూడో టీ20లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం మూడో టీ20 జరగనుంది. దీనికోసం టీమిండియా జట్టులో ఓ మార్పు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ను తొలగించి ఓపెనర్ రోహిత్ శర్మను జట్టులోకి తీసుకుంది. ఇక ఈ పిచ్ గురించి మాట్లాడిన కోహ్లీ.. ఒకవేళ తాము టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకునేవారిమని చెప్పాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ మాట్లాడుతూ.. పిచ్పై కొంత తేమ ఉందని, అది తమకు ఉపయోగపడుతుందని అనుకుటున్నామని చెప్పాడు. జట్టులో టామ్ కర్రాన్ స్థానంలో మార్క్ ఉడ్ను తీసుకున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా కెరీర్లో 100వ టీ20 ఆడుతున్న మోర్గాన్.. ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ తనకు, తన కుటుంబానికి ఎంతో కీలకమని అన్నాడు.