జలకాలాటలలో ఎంత హాయిలే...
ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST
కరోనా సమయంలో బాలీవుడ్ కథానాయికలు షూటింగ్స్ లేక ఖాళీ సమయంలో జిమ్ చేస్తూ ఫిట్నెస్తో ఫిదా చేస్తున్నారు. దీంతో పాటు అందుబాటులో ఉండే స్విమ్మింగ్ పూల్స్లో
కరోనా సమయంలో బాలీవుడ్ కథానాయికలు షూటింగ్స్ లేక ఖాళీ సమయంలో జిమ్ చేస్తూ ఫిట్నెస్తో ఫిదా చేస్తున్నారు. దీంతో పాటు అందుబాటులో ఉండే స్విమ్మింగ్ పూల్స్లో ఈతకొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమాలకోసం బికినీలు వేసే ముద్దుగుమ్మలు... ఈ ప్యానిక్ డేస్లో ఉచితంగా అందాల కనువిందు చేస్తున్నారు. ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఇటు ఉచితంగా పబ్లిసిటీ.. అటు వారి ఫిజిక్నూ సినిమాల్లోకంటే అందంగా ప్రదర్శించటం అలవాటైంది. ఈ ట్రెండ్ బాలీవుడ్ కథానాయికల్లో హాట్ టాపిక్!
ట్వంటీ ట్వంటీలోనే కాదు.. 2021లోనూ బాలీవుడ్ కథానాయికలు సముద్రతీరాల్లో విహరిస్తున్నారు. ఆ అవకాశం లేకపోతే ఇంట్లో ఉండే స్విమ్మింగ్పూల్స్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇష్క్జాదే తో బాలీవుడ్లో పాపులర్ అయిన పరిణీతీ చోప్రా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితకథలో కథానాయికగా నటించింది. మరో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అయితే కొవిడ్ కారణంగా షూటింగ్స్ లేవు కాబట్టి మొన్న మార్చిలోనే టర్కీలో వాలిపోయింది ఈ అమ్మడు. అక్కడ సాయంసంధ్య వేళలో సముద్రం దగ్గర సేదతీరుతోంది. ఈత కొడుతోంది. ఆ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేసింది. అది చూసి తన కజిన్ ప్రియాంక చోప్రా ‘ఐ యామ్ సో జలస్’ అంటూ కామెంట్ చేసింది. పరిణీతి షేర్ చేసిన ఆ ఫొటోకు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు.
‘మ్యాజిక్ హ్యాపెన్స్ ఎవ్రీడే’ అంటూ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఇంటి టెర్రస్ పైన స్విమ్ చేసే వీడియో అది. ఇక ‘భరత్ అనే నేను’, ‘కబీర్ సింగ్‘ ఫేం కియారా అద్వానీ ఇటీవల ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సముద్రంలోపల జలకన్యలా దూసుకుపోయింది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘అలల్ని ఆపలేం. కానీ ఈత నేర్చుకోవచ్చ’ంటూ టూపీస్ బికినీతో అందరినీ ఆశ్చర్యపర్చింది కియారా.
ఇష్టమైన దీవిలో..
కరోనా సమయంలో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు మాల్దీవుల్లో గడిపారు. కొవిడ్ సెకండ్ వేవ్ ముందు వచ్చిన గ్యాప్లో మాల్దీవులనే కేరాఫ్ అడ్ర్సగా మార్చుకున్నారు దక్షిణాది భామ రాయ్ లక్ష్మీలాంటి కొందరు. మాల్దీవుల్లో కత్రినాకైఫ్, తాప్సీ, సోనాక్షి సిన్హా, అలియాభట్, దిశాపటానీ, జాన్వీ కపూర్, సోహా అలీఖాన్.. లాంటి ముద్దుగుమ్మలు స్విమ్సూట్స్లో కనువిందు చేశారు. కొందరు కథానాయికలైతే.. ఆ పాత రోజులంటూ గతేడాది బీచ్లోని ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాస్త లాక్డౌన్ సెట్టయితే సినిమాల షూటింగ్స్కు హాజరవుతారో లేదో తెలీదు కానీ మాల్దీవుల్లో మాకాం వేయడం మాత్రం గ్యారెంటీ. మళ్లీ జలకాలాటలలో హాయినొందడానికి సిద్ధమవుతున్నారట బాలీవుడ్ భామలు. కనువిందు చేసే ఫొటోలు ఇకమీదట ఢోకాలేదన్నమాట.