వలంటీర్ అక్రమాలపై విచారణ
ABN , First Publish Date - 2021-04-21T05:53:33+05:30 IST
కురిచేడు పంచాయతీ కార్యాలయంలో వలంటీర్గా పనిచేస్తూ ఎస్ఐ, పంచాయతీ కార్యదర్శి కుర్చీలలో కూర్చొని ఫోజులు ఇచ్చిన అలహరి అఖిల్పై పోలీసులు విచారణ చేపట్టారు.
కురిచేడు, ఏప్రిల్ 20: కురిచేడు పంచాయతీ కార్యాలయంలో వలంటీర్గా పనిచేస్తూ ఎస్ఐ, పంచాయతీ కార్యదర్శి కుర్చీలలో కూర్చొని ఫోజులు ఇచ్చిన అలహరి అఖిల్పై పోలీసులు విచారణ చేపట్టారు. అతడి అక్రమాల చిట్టాలను పోలీసులు విచారిస్తున్నారు. కురిచేడుకు చెందిన ఓ మహిళ వద్ద రూ.2.35లక్షలు అక్రమంగా తీసుకున్న విషయమై చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే మరి కొంత మంది కూడా తాము కూడా మోసపోయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వినుకొండలో ఒకరికి మీసేవ కేంద్రం ఇప్పిస్తానని కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని సమాచారం. ఈ విషయమై పోలీసులు విచారిస్తున్నారు. పింఛన్ దారుల నుంచి కూడా కొంత మొత్తాలు వసూలు చేసినట్ల్లు సమాచారం. అఖిల్ మోసాల చిట్టాపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ పులి శివనాగరాజు తెలిపారు.