బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

ABN , First Publish Date - 2020-06-05T18:02:31+05:30 IST

విజయవాడ: బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మణికంఠ అలియాస్‌ పండుకు చికిత్స జరుగుతోంది.

బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

విజయవాడ: బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మణికంఠ అలియాస్‌ పండుకు చికిత్స జరుగుతోంది. గుంటూరు ప్రభుత్వాస్పత్రి దగ్గర పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. పండు ఎంబీఏ వరకు చదువుకున్నాడని.. అమాయకుడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గంజాయి బ్యాచ్‌లతో పండుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నేరాలు చేసే మైండ్‌సెట్‌ కాదని.. సందీప్‌ కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు. సందీప్‌ అతని తమ్ముడు కొంతమందితో తమ ఇంటికి వచ్చి హంగామా చేశారని వెల్లడించారు. సందీప్‌పై దాడి సమయంలో పండు చేతిలో ఆయుధాలు లేవని అతని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

Updated Date - 2020-06-05T18:02:31+05:30 IST