అర్హులకు పథకాలు అందేలా చూడాలి
ABN , First Publish Date - 2022-01-18T06:04:07+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు అందించేలా మండల పంచాయతీ అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ పమేలా సత్పథి కోరారు. ఎంపీవోల సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ను కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న ప
కలెక్టర్ పమేలా సత్పథి
భువనగిరి రూరల్, జనవరి 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు అందించేలా మండల పంచాయతీ అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ పమేలా సత్పథి కోరారు. ఎంపీవోల సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ను కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న పల్లె, బృహత్ ప్రకృతి వనాలు, హరితహారం, వైకుంఠధామాలు తదితర పథకాలను త్వరితగతిన పూర్తిచేసి ప్రజ లకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జేఏసీ జిల్లా చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, డీఆర్డీవో మందడి ఉపేందర్రెడ్డి, డీపీవో సునంద, అడిషినల్ డీఆర్డీవో నాగిరెడ్డి, ఎంపీవోల సంఘం జిల్లా అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు పైళ్ల జనార్థన్ రెడ్డి, దంతూరు వెంకటేశ్వర్లు, డీఎల్ పీవో యాదగిరి, సలీం, అంజిరెడ్డి, మాలిని, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.