పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలి

ABN , First Publish Date - 2022-01-29T05:09:52+05:30 IST

జగనన్న హౌసింగ్‌ కాలనీలో జరుగుతున్న పనులు సకాలంలో పూర్తయ్యేలా చూ డాలని పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనాథరెడ్డి సూచించారు.

పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలి
జగనన్న హౌసింగ్‌ కాలనీలో నీటి సరఫరా పైప్‌లైన్‌ పనులను పరిశీలిస్తున్న ఎస్‌ఈ

పులివెందుల టౌన్‌, జనవరి 28: జగనన్న హౌసింగ్‌ కాలనీలో జరుగుతున్న పనులు సకాలంలో పూర్తయ్యేలా చూ డాలని పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనాథరెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక కాలనీలో జరుగుతున్న నీటి సరఫరా పైప్‌లైన్‌ పనులను  ఈఈ, మున్సిపల్‌ కమిషనర్‌లతో కలిసి ఎస్‌ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు నిర్దేశించిన సమయంలో పూర్తి అయ్యేలా చూడాలన్నారు. జగన న్న కాలనీలో ప్లాట్‌ పొంది ఇంకా జియోట్యాగింగ్‌ చేయించుకోని లబ్ధిదారులు వెంటనే వారి సచివాలయాల్లో సంబంధిత పత్రాలను సమర్పించి వెంటనే జియో ట్యాగింగ్‌ చేయించుకోవాలన్నారు. అంతేకాకుండా ఎవరైతే మొదట జియోట్యాగింగ్‌ చేయించుకుంటారో వారి ఇళ్లను కట్టడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:09:52+05:30 IST