అర్హులైన కౌలు రైతులందరికి హక్కు పత్రాలు

ABN , First Publish Date - 2021-06-20T04:55:12+05:30 IST

మండలంలో అర్హులైన కౌలు రైతులకు పంట సాగుదారుల హక్కు పత్రాలను అందజేస్తామని వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సిద్దయ్యలు తెలిపారు.

అర్హులైన కౌలు రైతులందరికి హక్కు పత్రాలు

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 19: మండలంలో అర్హులైన కౌలు రైతులకు పంట సాగుదారుల హక్కు పత్రాలను అందజేస్తామని వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సిద్దయ్యలు తెలిపారు. శనివారం జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు రైతు భరోసా కేంద్రం-1లో వ్యవసాయాధికారి అధ్యక్షతన పంట సాగుదారుల హక్కు పత్రాలపై భూ యజమానులు, కౌలు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  హక్కు పత్రాల ద్వారా కౌలు రైతులందరికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌సబ్సిడీ, కనీస మద్దతుధర , రైతు భరోసా, వ్యవసాయ శాఖ ద్వారా అందించి రాయితీలను వర్తిస్తాయన్నారు. అర్హులైన కౌలు రైతులందరూ వీఆర్వో, వీఏఏలను సంప్రదించి పంట సాగు పత్రాలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వీఏఏలు, కౌలు రైతులు, భూ యజమానులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:55:12+05:30 IST