మాల్యాని రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం..
ABN , First Publish Date - 2021-01-19T05:52:31+05:30 IST
మాల్యాని రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం..
న్యూఢిల్లీ: భారత్ నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకున్న ఘరానా పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జస్టిస్ యు.లలిత్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం తెలిపారు. అయితే కొన్ని న్యాయపరమైన చిక్కులు ఇందుకు అడ్డంకిగా మారాయన్నారు. ఈ చిక్కులు ఎప్పటిలోగా పరిష్కారమవుతాయో చెప్పడం కూ డా కష్టమని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాల్యా అప్పగింతపై బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు తెలిపారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.