పర్యావరణ పరిరక్షణ కోసం గళమెత్తుతోంది!

ABN , First Publish Date - 2020-11-20T05:30:00+05:30 IST

‘‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చట్టాలను తీసుకురావాలి’’ అంటూ తరచూ గళమెత్తే లిసిప్రియ కంగుజం గురించి

పర్యావరణ పరిరక్షణ కోసం గళమెత్తుతోంది!

‘‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చట్టాలను తీసుకురావాలి’’ అంటూ తరచూ గళమెత్తే లిసిప్రియ కంగుజం గురించి అందరికీ తెలిసిందే. ‘గ్రెటా ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన ఈ తొమ్మిదేళ్ల మణిపురి బాలిక ఎన్నో అవార్డులను సైతం గెలుచుకుంది.


ఇటీవల పార్లమెంట్‌ ముందు ధర్నా చేస్తున్న ఈ చిన్నారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న చోట నిరసన తెలుపుతుండటంతో పోలీసులు లిసిప్రియను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తనను ఏమి అనలేదని, వాళ్ల కూతురులా చూసుకున్నారని కంగుజం ఆ తరవాత తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపింది.


పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఈ చిన్నారికి డా. ఎ.పి.జె అబ్దుల్‌కలాం చిల్డ్రన్స్‌ అవార్డు, వరల్డ్‌ చిల్ట్రన్‌ పీస్‌ ప్రైజ్‌, ఇండియా పీస్‌ ప్రైజ్‌ అవార్డులు లభించాయి. 

Updated Date - 2020-11-20T05:30:00+05:30 IST