శ్రీవారి దర్శనం కల్పిస్తాం

ABN , First Publish Date - 2020-06-05T11:23:37+05:30 IST

శ్రీవారి దర్శనం కల్పిస్తాం

శ్రీవారి దర్శనం కల్పిస్తాం

బాధ్యతలు స్వీకరించిన చినవెంకన్న ఆలయ ఈవో ప్రభాకరరావు


ద్వారకా తిరుమల, జూన్‌ 4 : ‘లాక్‌డౌన్‌తో కొంత కాలంగా దేవాలయాలు మూతబడ్డాయి. ఏకాంతసేవ లో స్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సడలించి ఆదేశాలు ఇస్తే దేవాలయంలో భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తాం’ అని ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్‌.ప్రభాకరరావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఇప్పటి వరకు జిల్లాలోనే కేఆర్‌ఆర్‌సీలో సబ్‌ కలెక్ట ర్‌గా పనిచేశానని, దేవాలయాలపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును దేవరపల్లిలోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. 

Updated Date - 2020-06-05T11:23:37+05:30 IST