సమానపనికి సమాన వేతనం అందించాలి
ABN , First Publish Date - 2021-10-23T04:56:09+05:30 IST
సమానపనికి సమాన వేతనం అందించాలి
దౌల్తాబాద్: మధ్యాహ్న భోజన కార్మికులకు సమానపనికి సమాన వేతనం అందించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్సచంద్రయ్య అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నభోజన కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు కార్డులు అందిస్తూ డబుల్ బెడ్ రూం ఇళ్లు, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్థులుగా గుర్తిస్తూ సౌకర్యాలు కల్పించాలన్నారు. సీఐటీయూ మండల కార్యదర్శి సత్యానందం, మధ్యాహ్న భోజన కార్మికులు పద్మమ్మ, సిద్దమ్మ, పర్వీన్బేగం, శివమ్మ, శ్రీనివాస్, వెంకటప్ప, వెంకటమ్మ, భారతమ్మ, నర్సమ్మ, పద్మమ్మ పాల్గొన్నారు.