సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-08-16T00:24:27+05:30 IST
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు: ఎర్రబెల్లి
జయశంకర్ భూపాలపల్లి: చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను కాపాడేందుకు హెలిక్యాప్టర్లను పంపించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందన్పల్లి గ్రామంలోని చలి వాగులో చిక్కుకున్న పది మంది రైతులను రెండు హెలికాప్టర్లలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తంచేశారు.