పారిశుధ్య కార్మికుల సేవలు భేష్‌: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-04-09T09:36:08+05:30 IST

పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులను బుధవారం కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి

పారిశుధ్య కార్మికుల సేవలు భేష్‌: ఎర్రబెల్లి

తొర్రూరు, ఏప్రిల్‌ 8: పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులను బుధవారం కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కోసం మునిసిపల్‌ కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ప్రభుత్వం వారికి బాసటగా ఉంటుందన్నారు. కార్మికులు అడగకముందే సీఎం కేసీఆర్‌ రూ.50వేల బోనస్‌ అందించారని తెలిపారు.

Updated Date - 2020-04-09T09:36:08+05:30 IST