మద్యం లేకపోవడంతో ఎర్రగడ్డ ఆస్పత్రిలో పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2020-03-30T17:55:58+05:30 IST

యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒక్క నిత్యావసర సరకుల షాపుల తప్ప మరేవీ తెరవట్లేదు.

మద్యం లేకపోవడంతో ఎర్రగడ్డ ఆస్పత్రిలో పెరుగుతున్న కేసులు

హైదరాబాద్ : యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒక్క నిత్యావసర సరకుల షాపుల తప్ప మరేవీ తెరవట్లేదు. మరీ ముఖ్యంగా మద్యం షాపుల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలే తీసుకున్నాయి. అయితే ఎనిమిది రోజులుగా మద్యం దొరక్కపోవడంతో మందు బాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరిద్దరు మందుబాబులు ఆత్మహత్యకు చేసుకున్నారు. మరికొందరైతే ఆత్మహత్యాయత్నం చేశారు. ఇలాంటి కేసులు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మద్యం లేకపోవడంతో ఇంకొందరు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. 


తాజాగా.. మద్యంకు బానిసైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గత ఎనిమిది రోజులుగా మద్యం దొరకకపోవడంతో షాపుల చుట్టూ తిరిగి తిరిగి వ్యక్తి విరక్తి చెంది గొంతుకోసుకున్నాడు. రోడ్డుపై ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ఆ యువకుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-03-30T17:55:58+05:30 IST