తెలంగాణకు నరసింహన్ విరాళం
ABN , First Publish Date - 2020-10-21T22:36:14+05:30 IST
భారీ వర్షాలు, వరదలతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. నగరవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. నగరవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితులపై మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందించారు. సహాయ కార్యక్రమాల కోసం తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 25 వేల రూపాయలను సీఎంఆర్ఎఫ్కు అందించారు. పరిస్థితి తొందరగా కుదుటపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నరసింహన్కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.