ఎస్టీ కార్పొరేషన్‌ రుణాలకు లబ్ధిదారుల ఎంపిక

ABN , First Publish Date - 2021-07-30T04:42:58+05:30 IST

ఎస్టీ కార్పొరేషన్‌ రుణాలకు లబ్ధిదారుల ఎంపిక

ఎస్టీ కార్పొరేషన్‌ రుణాలకు లబ్ధిదారుల ఎంపిక
తాండూరు రూరల్‌: లబ్ధిదారులను డ్రాపద్ధతిన ఎంపిక చేస్తున్న తాండూరు ఎంపీపీ అనితాగౌడ్‌

తాండూరు రూరల్‌: మండలంలోని ఆయా గ్రామాల్లో షెడ్యూల్డ్‌ తెగలకు సబ్సిడీ కింద రుణాలు పంపిణీ చేసేందుకు 98మంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డ్రా తీశారు. వీరిలో గురువారం తాండూరు ఎంపీపీ సంగెం అనితారవీందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో లబ్ధిదారులను డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. వీరిలో తాండూరు మండల పరిధిలోని ఆయా తండాల్లో లబ్ధిదారులు పాల్గొనగా ఐదుగురు లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఎస్‌.అనితాగౌడ్‌ తెలిపారు. రూ.1లక్ష 40వేల లోపు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికే ఎంపిక చేసినట్లు తెలిపారు. కొంత మంది లబ్ధిదారులు రూ.3లక్షల వరకు రుణ పరిమితి కోసం దరఖాస్తు చేసుకున్నారని, అట్టి వారికి అవకాశం కల్పించలేదన్నారు. అట్టి దరఖాస్తులను రెండో ప్రాతిపదికన ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. మండలంలోని ఆయా గ్రామాల తండాలకు చెందిన ఎక్కువమంది హాజరైనప్పటికీ రూ.లక్షా 40వేల వరకే అవకాశం కల్పించామని తెలిపారు. మిగితావారి దరఖాస్తులను ప్రాధాన్యత కింద ప్రభుత్వం సబ్సిడీ అందిస్తే వారికి కూడా రుణం పంపిణీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచు సంఘం తాండూరు మండల అధ్యక్షుడు మేఘనాథ్‌గౌడ్‌, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, ఎంపీహెచ్‌వో రతన్‌సింగ్‌, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

కొడంగల్‌లో లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు

కొడంగల్‌: కొడంగల్‌లో ఎస్టీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎస్టీ కార్పోరేషన్‌ లబ్ధిదారులకు ఆయా బ్యాంకుల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. లక్కీడిప్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఎంపీడీవో మోహన్‌లాల్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2021-07-30T04:42:58+05:30 IST