కొవ్వూరులో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు
ABN , First Publish Date - 2020-07-09T10:37:10+05:30 IST
కొవ్వూరులోని యానాదుల కాలనీలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశామని ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. పట్టణంలో 60 ఏళ్ల వారికి కరోనా పరీక్షలు
కొవ్వూరు, జూలై 8 : కొవ్వూరులోని యానాదుల కాలనీలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశామని ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. పట్టణంలో 60 ఏళ్ల వారికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఓ వృద్ధుడికి జూన్ 23న పరీక్షలు నిర్వహించగా జూలై 1న గుండెపోటుతో మృతి చెందారు. ఆ వృద్ధుడికి కరోనా పాజిటివ్ గా ఈనెల 7న నిర్ధారణ కావడంతో అతనితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించాలని వైద్యాధికారులను ఆదేశించినట్టు ఆర్డీవో తెలిపారు.