నిత్యావసర సరుకుల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ABN , First Publish Date - 2020-03-30T20:31:10+05:30 IST
నిత్యావసర సరుకుల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అమరావతి: నిత్యావసర సరుకుల పర్యవేక్షణకు అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లు నిర్వహిస్తారు. అధిక ధరలపై 1902 నెంబర్కు ఫిర్యాదు చేయాలని మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. నిత్యావసరాల సరఫరాకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్ సిస్టమ్ ప్రవేశపెట్టామని, ఇప్పటికే 101 రైతు బజార్లు.. వివిధ ప్రాంతాల్లో మరో 350 రైతు బజార్లు ఏర్పాటు చేశామన్నారు. 130 మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేశామని చెప్పారు. కిరాణా సరుకుల డోర్ డెలివరీని వినియోగించుకోవాలని ప్రద్యుమ్న సూచించారు.