ఎన్నికల్లో విధులకు ఉద్యోగులు సిద్దంగా లేరు: ఈశ్వరరావు
ABN , First Publish Date - 2021-01-10T18:32:08+05:30 IST
స్థానిక సంస్థలు ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని..
విశాఖపట్నం: స్థానిక సంస్థలు ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని ఏపీఎన్జీవో అసోసియేషన్, విశాఖ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు కోవిడ్ బారిన పడి మృతి చెందితే ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.