హుజురాబాద్‌లో వేడెక్కుతున్న ప్రచారాల జోరు

ABN , First Publish Date - 2021-10-26T18:40:11+05:30 IST

కరీంనగర్: హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కింది.

హుజురాబాద్‌లో వేడెక్కుతున్న ప్రచారాల జోరు

కరీంనగర్: హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కింది. కమలాపూర్‌లో ఈటల రాజేందర్ ఇంటింటి ప్రచారం చేశారు. హుజురాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగుతోందన్నారు. ఊర్లను బార్లుగా మార్చి మద్యం ఏరులుగా పారిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఏ పార్టీలో ఉండాలో శాసించే స్థాయికి టీఆర్ఎస్ వచ్చిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందన్నారు. మద్యం, నోట్ల కట్టలు, కుట్రలు, కుతంత్రాల పర్వం కొనసాగుతోందని ఈటల ఆరోపించారు.

Updated Date - 2021-10-26T18:40:11+05:30 IST