దుర్మార్గానికి ఘోరీ కట్టడం దగ్గరలో ఉంది: ఈటల
ABN , First Publish Date - 2021-06-23T22:13:08+05:30 IST
దుర్మార్గానికి ఘోరీ కట్టడం దగ్గరలో ఉంది: ఈటల
కరీంనగర్: అసైన్డ్ భూమిని తాను కొన్నానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. లేకపోతే సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అహంకారానికి, దుర్మార్గానికి ఘోరీ కట్టడం దగ్గరలో ఉందని చెప్పారు. తాను రాజీనామా చెయ్యలేదని, తనను పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. మంత్రి పదవి పోతే పోయిందని ఎమ్మెల్యేకు మాత్రం రాజీనామా చెయ్యకు బిడ్డా అని అందరూ చెప్పారని తెలిపారు. ఇజ్జత్ ఉన్నొన్ని కాబట్టి ఎమ్మెల్యేకు రాజీనామా చేశానని ఈటల తెలిపారు.