ఈటల రాజేందర్ నిండు నూరేళ్లు జీవించాలి: గంగుల
ABN , First Publish Date - 2021-07-21T01:47:03+05:30 IST
మాజీమంత్రి ఈటల రాజేందర్ నిండు నూరేళ్లు జీవించాలని మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. మంగళవారం
కరీంనగర్: మాజీమంత్రి ఈటల రాజేందర్ నిండు నూరేళ్లు జీవించాలని మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటల ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డువేస్తానని హామీ ఇచ్చారు. ఆయన సానుభూతి కోసం నీచ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ని విమర్శిస్తే ఊరుకోమని గంగుల హెచ్చరించారు. ఈటలతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, పార్టీలు వేరు కాబట్టే రాజకీయ పోరాటం మాత్రమే చేస్తానని పునరుద్ఘాటించారు. తనపై హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఈటలకు రహస్యంగా చెవిలో చెప్పిన మాజీ నక్సలైట్ ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రాజకీయ దాడులు, హత్యలు ఉండవన్నారు. ఆయన చేసిన హత్యారోపణలు వ్యక్తిగతంగానూ, తెలంగాణ రాష్ట్రానికి కూడా చెడ్డపేరు తెస్తామని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.