లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదు: మంత్రి ఈటల

ABN , First Publish Date - 2021-04-10T19:52:03+05:30 IST

లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదు: మంత్రి ఈటల

లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదు: మంత్రి ఈటల

హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోవిడ్ చికిత్సకు 50 శాతం బెడ్లు కోరిందని తెలిపారు. సాధారణ బెడ్లతో పాటు, ఐసీయూ, వెంటిలేటర్లు బెడ్లు  సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. మహారాష్ట్రలో ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు. తెలంగాణాకు మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువని చెప్పారు. మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణపై ఉంటుందన్నారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదన్నారు. సెకండ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

Updated Date - 2021-04-10T19:52:03+05:30 IST