కత్తి దూసిన ఈటల

ABN , First Publish Date - 2021-06-17T18:39:36+05:30 IST

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చారు.

కత్తి దూసిన ఈటల

కరీంనగర్ జిల్లా: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని కాట్రపల్లి ఎక్స్ రోడ్డు వద్ద పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు జెండాలు, ప్లెక్సీలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఈటలకు కత్తి ఇవ్వగా ఆయన కత్తి దూసి పైకెత్తి నేతలు, అభిమానులు, కార్యకర్తలకు అభివాదం తెలిపారు. దీంతో కార్యకర్తలు జై ఈటల.. జైజై ఈటల అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2021-06-17T18:39:36+05:30 IST