ఇన్ని రోజులు ఈటల అవినీతి కనిపించలేదా?: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2021-05-01T22:12:07+05:30 IST

అమీన్‌పూర్‌ భూముల స్కాం ఏమైంది? అని బీజేపీ నేత బండి సంజయ్‌ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణలు

ఇన్ని రోజులు ఈటల అవినీతి కనిపించలేదా?: బండి సంజయ్‌

హైదరాబాద్: అమీన్‌పూర్‌ భూముల స్కాం ఏమైంది? అని బీజేపీ నేత బండి సంజయ్‌ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణలు వాస్తవం కాదా అని నిలదీశారు. కరోనా కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించారని, తెలంగాణలో పరిస్థితి గంభీరంగా ఉందన్నారు. కబ్జాలు చేసిన మిగతా మంత్రులపై చర్యలేవి? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఇన్ని రోజులు మంత్రి ఈటల రాజేందర్ అవినీతి కనిపించలేదా? అని మరోసారి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కబ్జాలను తామే బయటపెట్టామని తెలిపారు. ఎమ్మెల్యేలపై డ్రగ్స్‌ కేసు నివేదిక ఏమైంది?.. 111 జీవో ఉల్లంఘన ఆరోపణలపై చర్యలేవి? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Updated Date - 2021-05-01T22:12:07+05:30 IST