పచ్చటి సంసారంలో కేసీఆర్ నిప్పు పెట్టారు: ఈటల
ABN , First Publish Date - 2021-10-18T21:50:37+05:30 IST
కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు తానే టికెట్ ఇప్పించానని చెప్పారు.
కరీంనగర్: కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు తానే టికెట్ ఇప్పించానని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి ప్రజలు నవ్వుకుంటున్నారని, పెద్దపల్లికి వస్తా కాసుకోమని సవాల్ విసిరారు. కేసీఆర్ బొమ్మతో గెలుస్తామనుకుంటున్నారు.. ఇకపై ఆ బొమ్మకు ఓట్లు పడవన్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కథ ముగియడం ఖాయమని స్పష్టం చేశారు.