కరీంనగర్ జిల్లాలో ఐదో రోజు ఈటల రాజేందర్ పాదయాత్ర
ABN , First Publish Date - 2021-07-23T13:13:45+05:30 IST
ఐదో రోజు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి మీదుగా పాదయాత్ర చేయనున్నారు. ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, మల్లన్నపల్లి
కరీంనగర్: ఐదో రోజు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి మీదుగా పాదయాత్ర చేయనున్నారు. ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, మల్లన్నపల్లి, టేకుర్తి, అవాల రామన్నపల్లి, గడ్డివానిపల్లి, చిన్నకోమటిపల్లి గ్రామాలలో ఈటల పాదయాత్ర కొనసాగనుంది. కాగా, గురువారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లె, సీతంపేట, బూజూనూర్, వంతడుపుల గ్రామాల్లో ఈటల పాదయాత్ర నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షంలో సాగిన యాత్రకు మహిళలు మంగళ హారతులతో ఈటల రాజేందర్కు స్వాగతం పలికారు.