ఎథెర్ ఎనర్జీ బైబ్యాక్ పథకం
ABN , First Publish Date - 2020-10-21T09:04:36+05:30 IST
న 450 ఎక్స్ ఈ-స్కూటర్ మోడల్ కోసం ‘అష్యూర్డ్’ బైబ్యాక్ పథకాన్ని ప్రకటించింది.
ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) సంస్థ ఎథర్ ఎనర్జీ.. తన 450 ఎక్స్ ఈ-స్కూటర్ మోడల్ కోసం ‘అష్యూర్డ్’ బైబ్యాక్ పథకాన్ని ప్రకటించింది. బైబ్యాక్లో భాగంగా రూ.85,000 ధరతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను మూడేళ్ల అనంతరం వెనక్కు తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ను దీపావళి నాటికి హైదరాబాద్, బెంగళూరు సహా మరో 8 నగరాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే ఎథర్ 450 ప్లస్ ఈ-స్కూటర్ ధరలను రూ.1.49 లక్షల నుంచి రూ.1,39,990 (ఎక్స్షోరూమ్)కి తగ్గించినట్లు తెలిపింది.