సగానికి తగ్గనున్న ఈవీల చార్జింగ్ ఖర్చులు
ABN , First Publish Date - 2022-01-24T06:42:31+05:30 IST
విద్యుత్ వాహనాల(ఈవీ) చార్జింగ్కు అయ్యే ఖర్చు ను దాదాపు సగం మేర తగ్గించే ఒక కొత్త సాంకేతికతను వివిధ ఐఐటీ విద్యాసంస్థల పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిపై ఇప్పటికే ప్రయోగాలు...
న్యూఢిల్లీ, జనవరి 23: విద్యుత్ వాహనాల(ఈవీ) చార్జింగ్కు అయ్యే ఖర్చు ను దాదాపు సగం మేర తగ్గించే ఒక కొత్త సాంకేతికతను వివిధ ఐఐటీ విద్యాసంస్థల పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిపై ఇప్పటికే ప్రయోగాలు పూర్తయ్యాయని.. పూర్తిస్థాయిలో అప్గ్రేడ్ చేసి, వాణిజ్యపరంగా సిద్ధం చేయడమే మిగిలి ఉందని పరిశోధకుల బృందం పేర్కొంది. ‘‘ఐఐటీ గువాహతి, ఐఐటీ భువనేశ్వర్లకు చెందిన పరిశోధకులతో కలిసి వారాణసీలోని ఐఐటీ(బీహెచ్యూ)లో ఈ సాంకేతికతను అభివృద్ధి చేశాం. మా తాజా సాంకేతికత ఉపయోగంతో చార్జింగ్కు పెడుతున్న ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. పాత విధానంతో పోలిస్తే ఆన్బోర్డ్ చార్జర్ సాంకేతికలో 50శాతానికి పైగా భాగాలను తగ్గించాం. ఇది చార్జర్గానూ ఇన్వర్టర్గానూ ఉపకరిస్తుంది. ఈ సాంకేతికత వల్ల ఆన్బోర్డు చార్జర్ ఖరీదు కూడా 50ు మేర తగ్గే అవకాశం ఉంది. ఇది పూర్తిగా దేశీయంగా తయారుచేశాం’’ అని పరిశోధకులు స్పష్టం చేశారు.