NTR అలా అనడం ఫన్నీగా అనిపించింది: రూ.కోటి విజేత Raja Ravindra

ABN , First Publish Date - 2021-11-21T22:07:54+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ గేమ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎపిసోడ్‌తో ప్రారంభమైన ఈ షో నిర్విరామంగా కొనసాగుతోంది.

NTR అలా అనడం ఫన్నీగా అనిపించింది: రూ.కోటి విజేత Raja Ravindra

ఇంటర్నెట్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ గేమ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎపిసోడ్‌తో ప్రారంభమైన ఈ షో నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ షోలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ ఎన్టీయార్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. అయితే ఈ షో ప్రారంభం నుంచి మొన్నటి దాకా ఎవరూ కూడా కోటి రూపాయలు గెలుచుకోలేదు. అయితే ఈ నెల 16, 17 తేదీల్లో ప్రసారమైన ఎపిసోడ్‌లో తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారి తొలిసారి కోటి రూపాయలు గెలిచి అందరి చూపు తనవైపుకు తిప్పుకున్నారు. సైబర్ క్రైమ్ వింగ్‌లో సీఐగా పని చేస్తున్న రాజా రవీంద్ర మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి షోలో విజేతగా నిలిచారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసుశాఖలో రాజా రవీంద్ర హాట్ టాపిక్‌గా మారారు. ఈ నేపథ్యంలో ఆయనతో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


‘‘ఎన్టీయార్ గారు హోస్ట్ సీట్ నుంచి కిందికి వచ్చారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో.. దేనిగురించైనా దిగుతున్నారేమో అనుకున్నా. అయితే నా దగ్గరకు వచ్చి ‘ఏంటి?.. మీరు చిట్టీలు పెట్టుకొచ్చారా?.. నేను చెప్పాల్సినవి కూడా మీరే చెప్పేస్తున్నారేంటి?’ అని ఆయన అనడం చాలా ఫన్నీగా అనిపించింది. ఎన్టీయార్‌లో ఉన్న ఆ సెన్సాఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది. మొత్తం 15 ప్రశ్నల్లో 14వ ప్రశ్న నాకు కష్టంగా అనిపించింది.’’ అని చెప్పుకొచ్చారు. ఆయన పంచుకున్న ఇంకా మరెన్నో ఆసక్తికర విషయాల కోసం వీడియో చూడగలరు.



Updated Date - 2021-11-21T22:07:54+05:30 IST