‘రామ మందిర నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి’
ABN , First Publish Date - 2021-01-21T06:17:57+05:30 IST
రామ జన్మభూమి అయోధ్యలో చేపట్టనున్న భవ్య రామమందిర నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఖానాపూర్ పట్టణ సంయోజక్ మహాజన్ జితేందర్ అన్నారు.
ఖానాపూర్, జనవరి 20: రామ జన్మభూమి అయోధ్యలో చేపట్టనున్న భవ్య రామమందిర నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఖానాపూర్ పట్టణ సంయోజక్ మహాజన్ జితేందర్ అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్నగర్ కాలనీలోని ముత్యాల పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామమందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమంలో భాగంగా జనజాగరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ నాయకులు పడాల ప్రభాకర్, దొనికెల రాజేశ్వర్, తుమ్మనపెల్లి సాంకేత్, అనిల్, రాజు, సందీప్, నాగరాజు, శరత్తో పాటు బీజేపీ, హిందూ ఉత్సవ సమితి, భజరంగ్దళ్, బీజేవైఎం, ఏబీవీపీ, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.