అందరికీ ఒకేలా వేతనాలను చెల్లించాలి

ABN , First Publish Date - 2021-07-30T06:05:36+05:30 IST

ఎంజీ యూనివర్సిటీలో సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరికీ ఒకేలా వేతనాలను చెల్లించాలని అధ్యాపకులు డిమాండ్‌ చేశారు.

అందరికీ ఒకేలా వేతనాలను చెల్లించాలి
ఎంజీయూ ప్రధాన క్యాంపస్‌కు పాదయాత్ర చేస్తున్న అధ్యాపకులు

ఎంజీయూ కాంట్రాక్ట్‌ అధ్యాపకులు

నల్లగొండ క్రైం, జూలై 29: ఎంజీ యూనివర్సిటీలో సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరికీ ఒకేలా వేతనాలను చెల్లించాలని అధ్యాపకులు డిమాండ్‌ చేశారు. పానగల్‌లోని ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి అన్నెపర్తిలోని ప్రధాన క్యాంపస్‌ వరకు అధ్యాపకులు గురువారం పాదయాత్ర నిర్వహించారు. అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఏడేళ్లుగా యూనివర్సిటీలో పనిచేస్తున్నా వేతనాలు పెరగలేదన్నారు. మూడేళ్ల క్రితం వేతనాల పెంపు కోసం విడుదలచేసిన జీవో 11 అమలుకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఒకేలా వేతనాలు  పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామచంద్రు, సాగర్‌, విజయ్‌, శివశంకర్‌, మహేశ్వర్‌, మౌనిక, అశ్విని, అఫ్రీన్‌, రమేష్‌, స్వర్ణలత, జ్యోతిరాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T06:05:36+05:30 IST