ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-25T06:19:42+05:30 IST

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావనను కలిగి ఉండాలని ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి
విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 

- కనుకులలో మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

సుల్తానాబాద్‌, అక్టోబరు 24: ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావనను కలిగి ఉండాలని ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలం లోని కనుకుల గ్రామంలోని మడేలేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్ర మాలలో ఆదివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు పండి తులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కార్యక్ర మ నిర్వహకులు ఆయనను ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావనను కలిగి ఉండాలని, దైనందిన జీవితంలో దైవ కార్యక్రమాలను కూడా భాగం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి సామూహిక పూజలు వ్రతాలు హోమాల ద్వారా లోక కల్యాణాన్ని ఆకాంక్షించడం మన ఆచారం సంప్రదాయమ న్నారు. మడేలేశ్వరస్వామి ఒక రజకులు ఆరాధ్య దైవమే కాదని అందరికి పూజ్యనీయు లన్నారు. విగ్రహ ప్రతిష్ఠకు వచ్చిన పండి తులు కాండూరి వాసు, వెంకటాచారి, అభిలా ష్‌శర్మ, సంతోష్‌ విక్రమాచారి, పవన్‌కుమార్‌ తదితరులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పోలు అం జయ్య, ఎంపీపీ బాలాజీరావు, కేడీసీసీబీ డైరక్టర్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా డైరక్టర్‌ పురం ప్రేంచందర్‌రావు, ముత్యం రమేష్‌, తుమ్మ రాజేశం, మాజీ ఎంపీపీ పాల రామారావు, మైలారం నారా యణ, గుర్రం శివ, రైతు సంఘం అధ్యక్షులు మీస శ్రీనివాస్‌, గరిగంటి కుమార్‌బాబు, కాంపల్లి రాజేశం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T06:19:42+05:30 IST