అందరూ పౌష్టికాహారం తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-01-26T06:09:27+05:30 IST
సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆన్నారు.
-కలెక్టర్ ఆర్వీ కర్ణన్
చిగురుమామిడి, జనవరి 25: సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోషక అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అందించే ఆహారాన్ని దుర్వినియోగం చేయొద్దన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎంపీపీ కొత్తవినీత-వ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.