బాలికల రక్షణకు ప్రతీఒక్కరు కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-01-25T06:23:56+05:30 IST
బాలికల రక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్తివారీ కోరారు.
అదనపు కలెక్టర్ దీపక్తివారీ
తుర్కపల్లి, జనవరి 24: బాలికల రక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్తివారీ కోరారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. బాలికలు చదువుతో పాటు వివిధ కార్యక్రమాల్లో ముందుండే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు. బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి ఒక్క పథకాన్ని వినియోగించుకోవాలని బ్రూణ హత్యలకు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపై చట్టపరమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి కేవి కృష్ణవేణి, మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్, ఎంపీడీవో ఉమాదేవి, సీడీపీవో చంద్రకళ, ఎంపీటీసీ పలుగుల నవీనకుమార్, సూపర్వైజర్ అనిత పాల్గొన్నారు.