ఈవీఎంల మాయతో గెలిచారు: టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్
ABN , First Publish Date - 2020-08-11T18:20:39+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలు ఓట్లు వేయడం ద్వారా...
కర్నూలు(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలు ఓట్లు వేయడం ద్వారా గెలవలేదని, ఈవీఎంలో జరిగిన మాయ వల్ల అధికారం చేపట్టారని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ ఆరోపించారు. సోమవారం కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మా ట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు కోరాలని చంద్రబాబు చాలెంజ్ చేస్తే.. జగన్ ఏ మాత్రం స్పందించలేదని అన్నారు. ప్రజలు తనకు ఎదురు తిరుగుతారని భావించడం వల్లె జగన్ స్పందించడం లే దని అన్నారు.
రాజధానిని మార్చడం వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి ఆగి పోతుందని, ప్రజల్లో వైషమ్యాలు చెలరేగుతాయని అన్నారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న కక్షతోనే జగన్ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని ఆరోపించారు.