శ్రీకాళహస్తి ఆలయ విగ్రహ వివాదంపై ఈవో చర్యలు

ABN , First Publish Date - 2020-09-19T03:02:03+05:30 IST

శ్రీకాళహస్తి ఆలయ విగ్రహ వివాదంపై ఈవో చర్యలు తీసుకున్నారు. ప్రధాన అర్చకుడితో పాటు ఆలయ అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు...

శ్రీకాళహస్తి ఆలయ విగ్రహ వివాదంపై ఈవో చర్యలు

తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయ విగ్రహ వివాదంపై ఈవో చర్యలు తీసుకున్నారు. ప్రధాన అర్చకుడితో పాటు ఆలయ అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ప్రధాన అర్చకుడు గురుకుల్‌, ఏఈవో ధన్‌పాల్‌, ఇద్దరు టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు సస్పెన్షన్ వేటు పడినవారిలో ఉన్నారు. ఈ వివాదంలో మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 11న ఆలయంలో అక్రమంగా శివలింగ ప్రతిష్టించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-09-19T03:02:03+05:30 IST