యూపీలో బీజేపీ నేత హత్య!

ABN , First Publish Date - 2021-04-03T12:58:07+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పరిధిలో...

యూపీలో బీజేపీ నేత హత్య!

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పరిధిలో గల నారాయణ పూర్‌లో బీజేపీ నేత బ్రజేష్ సింగ్ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి గ్రామం వెలుపల ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. ఆయన పట్టణంలోని తన ఇంటి నుంచి గ్రామానికి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రజేష్ సింగ్ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాధ్యక్షుని పదవికి పోటీ చేస్తున్నారు. 


తన నామినేషన్ కోసం ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హత్య అనంతరం బ్రజేష్ సింగ్ మృతదేహాన్ని గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడికి చేరుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఈ హత్యపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఎస్పీ పోలీసులు బలగాలతో సహా ఆసుపత్రికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-04-03T12:58:07+05:30 IST